ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే!

29 Oct, 2017 18:45 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా సినిమా 'జైలవకుశ'.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్‌ ప్రీరిలీజ్‌ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన జూనియర్‌కూ మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమాను ఎన్టీఆర్‌ చేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే.. ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ... ఈ టాప్‌ డైరెక్టర్లే ఎన్టీఆర్‌ 'జైలవకుశ' చేయడానికి కారణం. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్‌ తాజాగా ట్విట్టర్‌లో వెల్లడించారు.

ప్రిరిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్‌ రిక్వెస్ట్‌ చేయడంతో కోన వెంకట్‌ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. నిజానికి ఎస్ఎస్‌ రాజమౌళి ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. ఎస్‌ఎస్‌ రాజమౌళి, వీ వినాయక్‌లు తనకు సన్నిహితులు అని ఎన్టీఆర్‌ చెప్తుంటారు. 'జైలవకుశ' ఎన్టీఆర్‌ చేయడం వెనుక ఆ ఇద్దరు ఉండి ఉండొచ్చునని భావించారు. కానీ వినాయక్‌ ప్లేస్‌లో కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్‌కు 'జనతా గ్యారేజ్‌' వంటి భారీ విజయాన్ని అందించిన కొరటాల శివతోనూ ఎన్టీఆర్‌ మంచి స్నేహబంధం కలిగి ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు