బాలీవుడ్‌లోనూ 'క్షణం'

1 Mar, 2016 15:22 IST|Sakshi
బాలీవుడ్‌లోనూ 'క్షణం'

అడవి శేష్ హీరోగా గత శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించిన సినిమా క్షణం. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా ద్వారా రవికాంత్ పేరుపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అదాశర్మ, అనసూయ భరద్వాజ్లు ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను కేవలం కోటి రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్న క్షణం నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. పీవీపీ సంస్థ మాత్రం తామే స్వయంగా బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావిస్తుంది. మరోసారి రవికాంత్ దర్శకత్వంలో, అడవి శేష్ హీరోగా క్షణం సినిమాను బాలీవుడ్ రూపొందించే ఆలోచనలో ఉంది పీవీపీ సంస్థ.

>