10+10=20–10!

29 Oct, 2017 00:53 IST|Sakshi

మంచు మనోజ్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్‌ కథానాయిక. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్మీకాంత్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంది. దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ మాట్లాడుతూ– ‘‘హింస, అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే మనం పరిస్థితులకు తగ్గట్టు ఎలా ప్రవర్తిస్తామో... మనోజ్‌ క్యారెక్టరైజేషన్‌ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా కోసం తనతో ఏడాదిన్నరగా ట్రావెల్‌ చేస్తున్నా.

ఇందులోని ఓ పాత్ర కోసం మనోజ్‌ 20 కిలోలు బరువు పెరిగారు. మరో పాత్ర కోసం 10 కిలోలు తగ్గారు. నిర్మాతలు చాలా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు. ‘‘గ్రాఫిక్స్‌ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. సముద్రంలో, సముద్రం దగ్గర షూట్‌ చేసిన సీన్స్‌ విశేషంగా ఆకట్టుకుంటాయి. యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌. నవంబర్‌ 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. మిలింద్‌ గునాజీ, పోసాని కృష్ణమురళి, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నీఫర్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండ రామరాజు, సంగీతం: శివ నందిగామ.

మరిన్ని వార్తలు