-
లుక్ మార్చేస్తున్న యంగ్ హీరో
హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. మంచు వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కథానాయకుడు స్టార్ ఇమేజ్ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ఫెయిల్ అయిన మనోజ్, త్వరలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు చందు డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మనోజ్ స్లిమ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే వెయిట్ తగ్గేందుకు మనోజ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీ అయినా మనోజ్కు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
‘సెంటర్ని నమ్ముకుంటే...’
ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ రంగం నుంచి కూడా మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే యంగ్ నిఖిల్, దర్శకుడు కొరటాల శివ వంటి వారు హోదా కోసం తమ గళం వినిపించగా బీవీయస్ రవి, కొనవెంకట్లు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా ఈ లిస్ట్లో మరో యంగ్ హీరో మంచు మనోజ్ కూడా చేరిపోయాడు. తాజాగా ట్వీటర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఘాటుగా స్పందించాడు మనోజ్. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించిన విషయం గుర్తు చేసిన ఓ అభిమానికి సమాధానంగా ‘మనకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తా అన్నారు. చిప్ప తప్ప ఏమీ మిగల్లా. సెంటర్ ని నమ్ముకుంటే సంకనాకి పోతాం.’ అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీని నమ్మాలన్న ప్రశ్నకు సమాధానంగా నిన్ను నువ్వు నమ్ముకోవటం బెస్ట్ అని సమాధానమిచ్చారు. స్టేటస్ అయినా, ప్యాకేజ్ అయిన ఇవ్వాల్సింది సెంటర్ కదా ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్నకు బదులుగా ‘దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టేవరకు మనకి ఈ బానిస బతుకులు తప్పవ్’ అంటూ విమర్శించారు. -
మంచు మనోజ్ మరో ప్రయాణం..!
స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఆ స్థాయికి తగ్గ సక్సెస్లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరీర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టే హిట్ ఒక్కటి కూడా పడలేదు మనోజ్కు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనోజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తనకు ప్రయాణం లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, ఇంత వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా సాధించలేదు. చివరగా మనమంతా సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా హిట్ సినిమా అని మాత్రం అనిపించలేకపోయాడు. మనోజ్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు ఏలేటి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
రౌండప్ చేశారు!
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... ఇలా భాష ఏదైనా, పాత్ర ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు సుహాసిని. కాదు.. జీవిస్తారంటే బాగుంటుంది. క్యారెక్టర్ నటిగా మారిన తర్వాత కూడా మంచి రోల్స్ చేస్తున్నారామె. ఈ నెలలో మంచు మనోజ్ హీరోగా రిలీజైన ‘ఒక్కడు మిగిలాడు’లో మంచి పాత్రలో కనిపించారు. ఇప్పుడు రెండు కన్నడ సినిమాల్లో నటించేందకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి తమిళ ‘పవర్ పాండి’కి రీమేక్. తమిళ హీరో, నిర్మాత అయిన ధనుష్ ఈ చిత్రం ద్వారానే దర్శకునిగా మారిన విషయం తెలిసే ఉంటుంది. సినిమాకి మంచి ప్రశంసలు రావడం, యూనివర్సల్ కథాంశం కావడంతో బాగుంటుందని కన్నడంలో రీమేక్ చేయాలనుకున్నారట. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్కిరణ్ చేసిన పాత్రను అంబరీష్ చేయనున్నారు. ధనుష్ చేసిన గెస్ట్ రోల్ను సుదీప్, ఓ కీలక పాత్రను సుహాసిని చేయనున్నారు. ఈ చిత్రానికి ‘అంబి నింగె వయసాయితు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది కాకుండా కన్నడ నటుడు అనంతనాగ్ నటించనున్న సినిమాలో ఆమె ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని శాండిల్వుడ్ టాక్. అంటే ఒకటి గెస్ట్ రోల్ అయితే... రెండోవది ఇంపార్టెంట్ అన్నమాట. కన్నడంలో ఈ రెండు సినిమాలే కాదు.. తమిళంలో మూడు నాలుగు, మలయాళంలో ఒక సినిమా.. ఇలా సౌత్ని రౌండప్ చేస్తూ, సుహాసిని ఫుల్ బిజీగా ఉన్నారు. -
'ఒక్కడు మిగిలాడు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్కడు మిగిలాడు జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస, అజయ్ ఆండ్రూస్ నూతక్కి, మిలింద్గునాజీ, పోసాని కృష్ణమురళీ సంగీతం : శివ ఆర్ నందిగాం దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి నిర్మాత : ఎస్ఎన్ రెడ్డి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ హీరోగా ఓ భారీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్ ఫార్ములా సినిమాల కన్నా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించే మనోజ్, మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్ ఆకట్టుకున్నాడా..? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాదించాడా..? కథ : తన ప్రమోషన్ కోసం ఓ కాలేజ్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్ (మిలింద్ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాళ్లనుంచి తప్పించుకునేందుకు మరో దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకుండా వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తారు. నిజం తెలుసుకున్న విద్యార్థి నాయకుడు సూర్య(మంచు మనోజ్) విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాడు. కానీ మినిస్టర్ తన బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అనచివేసి సూర్యని అరెస్ట్ చేయిస్తాడు. కేసు కూడా నమోదు చేయకుండా చిత్ర హింసలు పెట్టి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. (సాక్షి రివ్యూస్) వారి కుట్రల నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు..? సూర్యకు శ్రీలంక శరణార్థలు కోసం పోరాడిన విప్లవనాయకుడు పీటర్ (మంచు మనోజ్)కు సంబంధం ఏంటి..? ఈ పోరాటంలో చివరకు సూర్య గెలిచాడా..లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న మంచు మనోజ్ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్ లు మాత్రమే చేసిన మనోజ్ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్ గా కనిపించిన మనోజ్, పీటర్ పాత్రలో కాస్త డ్రమెటిక్గా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్ ఆండ్రోస్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల్లో అజయ్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. (సాక్షి రివ్యూస్)బోట్ ప్రయాణంలో కనిపించిన వారంతా నేచురల్ గా నటించి మెప్పించారు. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన మార్క్ చూపించాడు. జర్నలిస్ట్ పాత్రలో అనీష ఆంబ్రోస్ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్ గునాజీ, బెనర్జీ తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు అజయ్, సినిమాను రియలిస్టిక్గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడి ప్రజల సమస్యలను వాళ్లు పడుతున్న ఇబ్బందులను, అక్కడి నుంచి శరణార్థులగా తప్పించుకొని వస్తున్న వారు ఆ ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కించటంతో కమర్షియల్ సినిమాగా కన్నా ఓ డాక్యుమెంటరీ సినిమాలా అనిపించింది. ఇక శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్ గా అనిపిస్తుంది. బోట్ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కినా.. నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఎమోషనల్ డ్రాగా తెరకెక్కిన సినిమాలో కథను పక్కదారి పట్టించే పాటలు లేకపోవటంతో సినిమా అంతా ఒకే మూడ్లో సాగుతుంది.(సాక్షి రివ్యూస్) అక్కడక్కడ వినిపించిన బిట్ సాంగ్స్ సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యాయి. నేపథ్యం సంగీతం కూడా సినిమా మూడ్ ను క్యారీ చేసింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి, శ్రీలంకలోని పోరాట సన్నివేశాలతో పాటు బోటు ప్రయాణం సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మంచు మనోజ్ నటన కథ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : మితిమీరిన డ్రామా సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement