మనుషులతో పాటు దేవుళ్లూ మారుతున్నారు

29 Oct, 2013 23:33 IST|Sakshi
మనుషులతో పాటు దేవుళ్లూ మారుతున్నారు
డా.రాజేంద్రప్రసాద్ యమధర్మరాజుగా నటించిన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. గోవింద్ వరహా దర్శకత్వంలో వసుంధర అకాడమీ పతాకంపై బి.చిరంజీవులు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ -‘‘ఇందులో నేను బ్రహ్మగా చేశాను.
 
  మనుషులతో పాటు దేవుళ్లూ మారుతున్నారనే కథాంశంతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చిత్రీకరణ పూర్తయింది. 20 నిమిషాల గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం, పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా చిరంజీవులు నాయుడు, అక్షయ్‌తేజ, అంబటి శ్రీను, కాదంబరి కిరణ్, బి.సత్యనారాయణ మాట్లాడారు.