డబ్బింగ్‌ చెబుతున్న సూపర్‌ స్టార్‌

26 Dec, 2016 16:48 IST|Sakshi
డబ్బింగ్‌ చెబుతున్న సూపర్‌ స్టార్‌

చెన్నె: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, అగ్రశ్రేణి దర్శకుడు శంకర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్‌ '2.0' నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. సోమవారం నుంచి డబ్బింగ్‌ మొదలు పెట్టారు. హీరో రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్‌ విన్నింగ్‌ సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పోకుట్టి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  '2.0' డబ్బింగ్ పనుల కోసం చెన్నై వెళుతున్నట్టు ఆయన తెలిపారు.

రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్‌ సైంటిస్ట్‌, చిట్టి రోబో పాత్రల్లో కనిపించనున్నారు. లికా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాంశు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గత నెలలో ముంబైలో విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. 2017 దీపావళికి త్రీడీలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

>