సరికొత్త యాంగిల్‌

16 Oct, 2018 00:58 IST|Sakshi
నవీన్, సాయి ధరమ్‌ తేజ్, కల్యాణి, కిషోర్‌ తిరుమల, రవి శంకర్, మోహన్, చెర్రీ

‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ‘చిత్రలహరి’ సినిమా రూపొందుతోంది. ‘హలో’ ఫేమ్‌ కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చిత్రలహరి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ కొరటాల శివ క్లాప్‌  ఇవ్వగా, సాయిధరమ్‌ తేజ్‌ తల్లి విజయ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం) మాట్లాడుతూ– ‘‘రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్‌ తేజ్‌తో మా బ్యానర్‌లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. హార్ట్‌ టచిం గ్, లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను చక్కగా తెరకెక్కించడంలో కిషోర్‌  బెస్ట్‌.  అన్ని అంశాలతో తేజ్‌ను సరికొత్త యాంగిల్‌లో చూపించనున్నాం. నవంబర్‌ మొదటివారం నుంచి  రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది.  త్వరలోనే ఇతర  నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, లైన్‌ప్రొడ్యూసర్‌:  కె.వి.వి.బాల సుబ్రమణ్యం.

మరిన్ని వార్తలు