ఎన్ని వింతలో...

12 Jan, 2018 00:45 IST|Sakshi

దర్శకుడు వీవీ వినాయక్‌ శిష్యుడు వరప్రసాద్‌ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. నందు, సౌమ్య వేణుగోపాల్‌ జంటగా పూజా రామచంద్రన్‌ కీలక పాత్రలో ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని వినాయక్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వరప్రసాద్‌ దర్శకుడిగా మారి, ఓ సినిమా చేస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్‌ అయ్యా. ట్రైలర్‌ చాలా బాగుంది.

ఈ సినిమా వరప్రసాద్‌కి మంచి హిట్‌ ఇచ్చి,  పెద్ద హీరోలతో సినిమా తీసే రేంజ్‌కి ఎదగాలని  కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. వినాయక్‌గారు ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అని ఇప్పిలి రామమోహనరావు అన్నారు. నల్లవేణు, దువ్వాసి మోహన్, కౌశిక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: డి.శ్రీనివాస్‌ ఓంకార్, కెమెరా: ఎస్‌. మురళీమోహన్‌ రెడ్డి, సంగీతం: యాజమాన్య.

మరిన్ని వార్తలు