బిస్కెట్ ఎవరు వేశారు?

29 Sep, 2013 01:17 IST|Sakshi
బిస్కెట్ ఎవరు వేశారు?
‘‘ఒక దర్శకుడికి దర్శకత్వంతో పాటు సంగీతం మీద కూడా అవగాహన ఉండటం విశేషం. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు రాష్ట్ర మంత్రి డీకే అరుణ అన్నారు. అరవింద్ కృష్ణ, డింపుల్‌చోపడే జంటగా గోదావరి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ దీపక్‌రాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బిస్కెట్’. రాజ్, స్రవంతి నిర్మాతలు. అనిల్ గోపీరెడ్డి దర్శకత్వం వహించి, పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని డీకే అరుణ విడుదల చేసి, దర్శకుడు వీరభద్రంకు ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ వేడుకలో బసిరెడ్డి కూడా పాల్గొన్నారు. అరవింద్‌కృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో బిస్కెట్ వేస్తుంటారు. లేకపోతే ఇతరులు వేసే బిస్కెట్‌కి పడిపోతుంటారు. ఈ చిత్రంలో ఎవరు ఎవరికి బిస్కెట్ వేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.