మానవత్వం చాటుకున్న బెంగళూరు పోలీసు

18 Apr, 2020 06:37 IST|Sakshi

బనశంకరి: లాక్‌డౌన్‌ సమయంలో సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న క్యాన్సర్‌ రోగి కోసం ఓ కానిస్టేబుల్‌ 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించారు. ఈ నెల 11 తేదీన ఓ కన్నడ చానల్‌ నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి ధార్వాడకు చెందిన క్యాన్సర్‌ రోగి ఉమేశ్‌ ఫోన్‌ చేశారు. తనకు అత్యవసరమైన ఔషధాలు బెంగళూరులో మాత్రమే లభిస్తాయని, లాక్‌డౌన్‌ వల్ల అక్కడికి వెళ్లలేకపోతున్నానని గోడు వినిపించుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బెంగళూరు పోలీస్‌ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్న ఎస్‌.కుమారస్వామి స్పందించారు. 12న బైక్‌పై బెంగళూరు నుంచి 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్వాడకు వెళ్లి ఆ రోగికి ఔషధాలు అందించారు.

మరిన్ని వార్తలు