నాకు క‌రోనా సోకింది : బీజేపీ ఎమ్మెల్యే

8 Jul, 2020 14:01 IST|Sakshi

పూణె :  క‌రోనాకు చిన్నా పెద్దా తేడా అన్న క‌నిక‌రం ఉండ‌దు. అంతేకాకుండా అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టికే పలువురు ప్ర‌ముఖులు, ప్ర‌జా ప్ర‌తినిధులు  క‌రోనా బారిన‌పడ్డ సంగ‌తి తెలిసిందే. తాజాగా పూణెలోని క‌స్భా నియోజ‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిల‌క్‌కు క‌రోనా పాజ‌టివ్ నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. త‌న‌తో పాటు త‌న త‌ల్లికి కూడా క‌రోనా సోకింద‌ని అయితే ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు మాత్రం  బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అసింప్టమాటిక్‌గా ఉన్న తామిద్ద‌రం డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఇంట్లోనే ఐసోలేష‌న్ అయిన‌ట్లు తెలిపారు.  మిగ‌తా కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించిగా  నెగిటివ్ వ‌చ్చింద‌న్నారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే ముక్తా ట్వీట్ చేశారు. (కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి )

మరిన్ని వార్తలు