సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో భారత్లో మరో 50మంది మృత్యువాత పడ్డారు. మరో 1383 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! )
ఇక ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ అక్కడ 5,218 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 2,178 కరోనా కేసులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే అక్కడ 19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!)
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 25.55 లక్షలు దాటాయి. 1.77 లక్షల మంది మృతి చెందగా, 6.90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 8.18 లక్షలు దాటగా, నిన్న ఒక్కరోజే 25,607 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2, 782మంది మరణించారు. (చైనా వైద్యులకు కరోనా టీకా !)
దేశాలు వారీగా...