ఆ నగరాల నుంచి కోల్‌కతాకు విమానాల్లేవ్‌

5 Jul, 2020 02:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాల ద్వారా ఒక నగరం నుంచి మరో నగరానికి వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నట్లు తేలడంతో ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు విమానాల రాకపోకలను నిలిపివేస్తూ అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్, అహ్మదాబాద్‌ నుంచి కోల్‌కతాకు ప్యాసింజర్‌ ఫ్లైట్లు ఉండబోవని కోల్‌కతా ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు