ఫేమస్ థియేటర్లో అగ్నిప్రమాదం

2 Oct, 2016 12:28 IST|Sakshi

కోల్కతా: కోల్కతాలోని అతిపురాతన సింగిల్ స్క్రీన్ థియేటర్ జ్యోతీలో అగ్నిప్రమాదం సంభవించింది. జ్యోతీ థియేటర్లో ఆదివారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని హాలు మొత్తం వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మొత్తం 26 ఫైర్ ఇంజిన్లను మంటలు ఆర్పడానికి ఉపయోగించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.  

సెంట్రల్ కోల్కతాలోని ఎస్ప్లనేడ్లో 1930 దశకంలో జ్యోతీ థియేటర్ ప్రారంభించారు. తిరిగి 2008లో మూసివేశారు. 1970వ దశకంలో 70ఎమ్ఎమ్ చిత్రాల ప్రదర్శనతో ఈ థియోటర్ పేరు మారుమోగింది. ఆ రోజుల్లో బాలీవుడ్ చిత్రాలతో పాటూ హాలీవుడ్ చిత్రాలను కూడా ఈ థియేటర్లో ఎక్కువగా ప్రదర్శించే వారు. 

మరిన్ని వార్తలు