కశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి

20 Nov, 2015 11:58 IST|Sakshi

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లతో సహా నలుగురు గాయపడ్డారు.

పుల్వామా జిల్లాలో శ్రీనగర్, జమ్ము జాతీయ రహదారిపై  సీఆర్పీఎఫ్ సిబ్బంది  వెళ్తుండగా ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడినట్టు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసినవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు