ప్రాంతీయ పార్టీల కూటమి అవసరం: ఉద్ధవ్‌

9 Feb, 2017 02:44 IST|Sakshi
ప్రాంతీయ పార్టీల కూటమి అవసరం: ఉద్ధవ్‌

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంతో శివసేన ‘నోటీస్‌ పీరియడ్‌’లో ఉందని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే ప్రాంతీయ పార్టీల మహాకూటమిపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ పార్టీలపై పోటీ చేసేందుకు ప్రాంతీయ పార్టీల కూటమే సరైన ప్రత్యర్థన్నారు.

‘బీజేపీకి మిత్రులైన నితీశ్, మమత, జయలలిత (దివంగత) వంటివారంతా.. కూటమిలోనుంచి బయటకెళ్లి బలమైన ప్రాంతీయపార్టీలుగా మారి విజయాలు సాధిస్తున్నారు. కానీ మేం (శివసేన) అమాయకులం. హిందూత్వ కోసమే ఎన్డీఏలో ఉన్నాం. మాకూ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం’ అని బుధవారం ముంబైలో తెలిపారు.

మరిన్ని వార్తలు