మేఘాలయ గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

14 Dec, 2019 09:33 IST|Sakshi

షిల్లాంగ్‌ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్‌ తథాగత రాయ్‌ శుక్రవారం వివాదాస్పద ట్వీట్‌ చేశారు. అలాంటి వారు నార్త్‌ కొరియాకు వెళ్లిపోవచ్చని సూచించారు. పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు. 1. దేశ విభజన మతం కారణంగా జరిగింది. 2. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చు అని ట్వీట్‌ చేశారు.

గవర్నర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజభవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలను దాటి లోపలికి ప్రవేశించాలని యత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్‌ జరిపారు. అనంతరం టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు