మరో 23 రైళ్లకు ఐఆర్‌సీటీసీ సేవలు

11 Sep, 2016 02:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆహార సరఫరా, నిర్వహణ సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చే యత్నాల్లో భాగంగా  రైల్వే శాఖ మరో 23 రైళ్లలో కేటరింగ్ బాధ్యతను ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. దీంతో ఈ సంస్థ అధీనంలో కేటరింగ్ నడుస్తున్న రైళ్ల సంఖ్య 115కు చేరింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ 65 ఎక్స్‌ప్రెస్, 6 రాజధాని, 13 దురంతో, 6 శతాబ్ది, 2 సువిధ రైళ్లలో సేవలందిస్తోంది.

మరిన్ని వార్తలు