నిర్భయ ఫండ్కు రూ.2000 కోట్లు

28 Feb, 2015 13:17 IST|Sakshi

న్యూఢిల్లీ :  నిర్భయ ఫండ్ కోసం మూలధన నిధిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. గత ఏడాది నిర్భయ ఫండ్కు రూ.1,000 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా మరో వెయ్యి కోట్లు కేటాయించింది.  ఈ నిధులను మహిళలు, బాలికల భద్రత కోసం వినియోగిస్తారు. నిర్భయ ఫండ్ను తొలిసారిగా యూపీఏ సర్కార్ 2013 సంవత్సరంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు