‘ప్రీ ఫైనల్‌లో గెలవలేని వారు ఫైనల్లో గెలుస్తారా’

15 Mar, 2018 16:37 IST|Sakshi
మంత్రి జగదీష్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు ఎమ్మెల్యేల సభ్వత్వ రద్దుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్న కాంగ్రెస్‌ నేతలు కోర్టుకు ఎందుకెళ్తున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆయన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రీ ఫైనల్‌లో గెలవలేని వారు ఫైనల్లో గెలుస్తారా అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండు పార్టీలే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
 

>
మరిన్ని వార్తలు