సాక్షి, న్యూఢిల్లీ: ‘పాకిస్థాన్ మనల్ని విభజించాలని చూస్తోంది. కానీ భారత్ ఉమ్మడిగానే ఉంటూ పోరాడుతుంది. ఒక్కటిగానే మనుగడ సాగిస్తూ.. విజయం సాధిస్తుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన గురువారం భారీ వీడియో కాన్ఫరెన్స్లో సుమారు కోటిమంది బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. ‘మేరి బూత్.. సబ్సే మజ్బూత్’ పేరిట ప్రధాని నిర్వహిస్తున్న ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రపంచంలోనే అతిపెద్దదని, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10కోట్ల మంది ప్రజలకు వివిధ వేదికల ద్వారా చేరుతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాక్ చేతిలో భారత పైలట్గా బంధీగా ఉన్న సమయంలోనే ఈ వీడియో కాన్ఫరెన్స్ను మోదీ నిర్వహిస్తుండటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించిన ప్రధాని మోదీ ఏమన్నారంటే..