కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..! 

29 Jul, 2019 11:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అమాయకపు రైతుల పొట్టకొట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొద్ది రోజులు ఆగితే అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుందని ట్విటర్‌ వేదికగా హెచ్చరించారు. ‘ కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్‌సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్‌గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’  అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

సానా సతీశ్‌తో.. చంద్రబాబు సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి
మనీలాండరింగ్‌ దళారి సానా సతీశ్‌తో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ప్రముఖల సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. చిరుద్యోగం చేసుకునే వ్యక్తి.. అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసని ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘మనీలాండరింగ్‌ దళారి సానా సతీశ్‌తో.. చంద్రబాబు, టీడీపీ ప్రముఖుల సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి... అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి... ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను ఆడగండి నెహ్రు..
పదవి, ప్యాకేజీ కోసం జ్యోతుల నెహ్రూ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అసాధ్యమని తెలిసినా 5శాతం రిజర్వేషన్‌ ప్రకటించినందుకు బాబును నెహ్రూ పొగిడారని విమర్శించారు. ‘కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అసాధ్యమని తెలిసీ 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బాబును పొగిడింది మీరే కదా? ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు