విజేత హుమేరా 

7 Oct, 2018 00:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి షేక్‌ హుమేరా అండర్‌–18 బాలికల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో హుమేరా 6–2, 6–4తో తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మికపై గెలిచింది.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సిద్ధార్థ్‌ 6–2, 6–7 (2/7), 6–3తో అర్జున్‌పై... మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మహెక్‌ 6–1, 6–2తో జీల్‌ దేశాయ్‌పై గెలిచారు. విజేతలకు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌ ట్రోఫీలను అందజేశారు. 

>
మరిన్ని వార్తలు