కారు - లారీ ఢీ: 12 మంది మృతి

19 Feb, 2016 11:34 IST|Sakshi

చిత్రదుర్గ : కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని చిక్కగొడనహళ్లీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఐరన్ రాడ్ల లోడ్తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీలోని ఐరన్ రాడ్లు కారుపై పడిపోయాయని చెప్పారు.

మృతుల్లో చిన్నారి కూడా ఉందని తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారని... అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్, ఓనర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్థరాత్రి చిక్కగొడనహళ్లీలో జరిగిన వేడుకల్లో పాల్గొని... స్వగ్రామం కొండ్లహళ్లీకి వారంత కారులో బయలుదేరి.... ఈ ప్రమాదానికి గురయ్యారని చిత్రదుర్గ జిల్లా ఎస్పీ చెప్పారు.

మరిన్ని వార్తలు