ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్‌

15 Mar, 2017 11:56 IST|Sakshi
విజయవాడ: విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మ్యాన్ హోల్ పూడిక తీసేందుకు బుధవారం ఇద్దరు కార్మికులు దిగారు. పూడిక తీసే సమయంలో ఊపిరాడక వారు అక్కడికక్కడే మృతిచెం‍దారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
మరిన్ని వార్తలు