నక్కపల్లి : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్గేట్ వద్ద పోలీసుల తనిఖీలో 62 కేజీల గంజాయి పట్టు బడింది. జి.మాడుగుల నుంచి తమిళనాడులోని వేలూరుకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.