జమ్మికుంటలో కార్డన్ సెర్చ్

21 Dec, 2016 11:06 IST|Sakshi
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మోతుకులగూడెంలో బుధవారం తెల్లవారు జామున కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో  ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని అణువుణవూ తనిఖీ చేశారు. ఎలాంటి లైసెన్స్ లేని 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే సమాచారం అందించాలని ప్రజలను కమిషనర్ కోరారు.
మరిన్ని వార్తలు