విభజన ఇబ్బంది

20 Feb, 2014 04:59 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను నిట్ట నిలువునా చీల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతిని నిరసిస్తూ బుధవారం చేపట్టిన సీమాంధ్ర బంద్‌ను పురస్కరించుకుని నగరం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు నిలిచిపోయాయి. బంద్ గురించి ముందే తెలిసినందున ప్రయాణికులు కూడా పెద్దగా బస్టాండ్లకు రాలేదు. వారాంతం కాకపోవడం వల్ల రద్దీ కనిపించలేదు. తిరుపతి, కడప మార్గాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి, హైదరాబాద్ వైపు రాత్రి ఏడు గంటల నుంచి అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించామని ఏపీఎస్ ఆర్టీసీ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రారెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు