మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ హల్‌చల్

17 Jul, 2014 09:05 IST|Sakshi
మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ హల్‌చల్

బెంగళూరు : కర్ణాటకలోని గౌరిబిందనూరు సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ గురువారం హల్చల్ చేశాడు. తీవ్ర నేరారోపణలు ఉన్న దోపిడీ దొంగ దుర్గాప్రసాద్ ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా వారిపై కాల్పులు జరిపాడు. ఓ ఫాంహౌస్‌లో దుర్గా ప్రసాద్ ముఠా దోపిడీకి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, దోపిడీ దొంగల మధ్య కాల్పులు జరిగాయి.

 ఈ ఘటనలో ఓ ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. దుర్గాప్రసాద్ పరారీ కాగా, ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఓ నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు