నర్సంపేట: మేకపాల విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. అన్నదమ్ముల మధ్య పాల విషయంలో గొడవ జరగడంతో.. కోపోద్రిక్తుడైన అన్న తమ్ముడిని కర్రతో చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.