కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ వద్ద ఎగువన కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని చిన్న చిన్న చెరువులు నిండిపోయాయి. పొతంగల్ వద్ద ఉన్న కుమ్మరివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పక్కనున్న పొలాలు నీట మునిగాయి. అక్కడ వేసిన సోయా, వరి, అరటితోటలు నీట మునిగిపోయాయి.