భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

22 May, 2017 14:14 IST|Sakshi
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లిన మహిళ వడదెబ్బకు గురై మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. కొత్తగూడెంలోని గాంధీనగర్‌ కాలనీలో నివాసముంటున్న షేక్‌ రజ్జబ్‌ హుస్సేన్‌- సైదానిబేగంల మూడో పుత్రిక జకియాబేగం వివాహం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన అహ్మద్‌ పాషాతో నిశ్ఛయమైంది.
 
ఈ రోజు పెళ్లి జరగనుండగా.. నిన్న(ఆదివారం) పెళ్లి కూతురు తల్లి సైదానిబేగం బంధుమిత్రులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లి వడదెబ్బకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా ఈ రోజు మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరి కాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కూతురి తల్లి మరణించడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. 
మరిన్ని వార్తలు