సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ నమోదుకు 160 కేంద్రాలను ఆధార్ ప్రాధికార సంస్థ మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థుల ఆధార్ నమోదు కాలేదు. వాటిని పూర్తి చేసేందుకు ఈ కేంద్రాలను మంజూరు చేసింది. ఇందుకు రూ.2.5 కోట్లను కేటాయించింది. వీటిని జనవరి 2వ వారంలో ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.