అప్పా జంక్షన్‌ వద్ద ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత.. ఆ లీడర్‌వేనని అనుమానాలు?

18 Nov, 2023 16:55 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్: నగర శివార్ల‌లో శనివారం భారీ న‌గ‌దు పోలీసులకు ప‌ట్టుబ‌డింది. ఆధారాల్లేకుండా త‌ర‌లిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు అప్పా జంక్ష‌న్ వ‌ద్ద ఆరు కార్ల‌లో ఈ న‌గ‌దు త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు త‌నిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు.

అయితే.. ప‌ట్టుబ‌డ్డ ఈ న‌గ‌దు ఖ‌మ్మం జిల్లా నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ఓ నాయకుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలె ఐటీ దాడులు ఎదుర్కొన్న నేత అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ తనిఖీలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు