రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

1 Feb, 2015 17:05 IST|Sakshi
రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం లింగాపురం గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో  రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే  మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు