కార్డన్ సెర్చ్‌.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు

13 Sep, 2015 16:08 IST|Sakshi
కార్డన్ సెర్చ్‌.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు

రాజేంద్రనగర్ (రంగారెడ్డి): రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పత్రాలు లేకపోవడంతో 50 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నలుగురు రౌడీ షీటర్లు, పది మంది పాత నేరస్తులు ఉన్నారని సమాచారం.

మరిన్ని వార్తలు