ఉపసర్పంచ్ పై సర్పంచ్ భర్త దాడి

1 Jul, 2015 15:14 IST|Sakshi

కీసర (రంగారెడ్డి): శ్మశానవాటిక విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి ఉపసర్పంచ్ పై గ్రామసర్పంచ్ భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో బుధవారం చోటుచేసుకుంది. దమ్మాయిగూడలో ఇళ్ల మధ్య శ్మశానవాటిక నిర్వహించొద్దదని ప్రజాప్రతినిధులను, స్థానిక అధికారులను ప్రజలు నిలదీశారు.

ఇళ్ల మధ్య శ్మశానవాటిక నిర్వహణ వద్దని వారించినందుకు గ్రామ ఉపసర్పంచ్ పై సర్పంచ్ భర్త దాడి చేసి గాయపరిచాడు. బాధిత ఉపసర్పంచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు