ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 8న పీఈటీ టెస్టు

1 Aug, 2018 00:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 8వ తేదీన ఉదయం 5 గంటలకు పీఈటీ, ఈవెంట్స్‌ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. టెస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్లో పొందవచ్చని సూచించింది.

మరిన్ని వార్తలు