జెన్‌కోతో బీహెచ్‌ఈఎల్ చర్చలు

5 Dec, 2014 05:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ జెన్‌కో.. బీహెచ్‌ఈఎల్‌తో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీఎస్‌జెన్‌కో సీఎండీ ప్రభాకరరావుతో బీహెచ్‌ఈఎల్ సీఎండీ ప్రసాదరావు భేటీ అయ్యారు.   మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని రెండేళ్లలో.. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఏడో యూనిట్‌ను మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని టీఎస్ జెన్‌కో లక్ష్యంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు