సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్లో సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. నిత్యావసర సేవల కేటగిరీలో భాగంగా హైదరాబాద్లోని ఐడీఏ నాచారంలో ఉన్న తెలంగాణ ఫుడ్స్ సంస్థలో సమ్మెను ఆర్నెల్లపాటు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు.