జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా

29 Oct, 2014 13:13 IST|Sakshi

హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.  సమ్మె విరమిస్తేనే కేసు విచారిస్తామని న్యాయస్థానం మరోసారి జూడాలకు స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని,  జూనియర్ డాక్టర్ల వాదనలతో తాము ఏకీభవించటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.. జూనియర్ డాక్టర్లు ఇంకా పరిణితి చెందాల్సి ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.  కాగా సమ్మె కొనసాగించేందుకే జూనియర్ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని జూడాల తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

మరిన్ని వార్తలు