ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

12 Dec, 2018 02:41 IST|Sakshi

జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అక్రమాలు జరిగాయని భావిస్తే ఎన్నికల ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసుకోవాలని ఓట్లలెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎన్నికల వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమంది.  

మరిన్ని వార్తలు