ఖరీఫ్ కు 9 గంటల విద్యుత్తు

14 Feb, 2015 16:45 IST|Sakshi

 కామారెడ్డి: వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి వ్యవసాయ రంగానికి రోజుకు 9 గంటల విద్యుత్తు ఇస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు.

అక్కడ జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు