తమ గ్రామం పేరు లేదని మంత్రి, ఎంపీ అడ్డగింత..

28 Jan, 2017 18:24 IST|Sakshi

కరీంనగర్‌:
తమ గ్రామం పేరును శిలాఫలకంపై పెట్టలేదంటూ గ్రామస్తులు మంత్రిని, ఎంపీని ఘెరావ్‌ చేశారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. చొప్పదండి మండలం రేవెల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం మినీట్యాంక్‌ బండ్‌ పనులను ప్రారంభించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే బొడిగె శోభ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, ఈ సందర్భంగా వేసిన శిలాఫలకంలో తమ గ్రామం పేరు లేదంటూ దేశాయిపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధులను ఘెరావ్‌ చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత శాంతించి వారికి దారిచ్చారు.

మరిన్ని వార్తలు