రూ.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

28 Feb, 2015 10:05 IST|Sakshi

నల్లగొండ : నకిలీ నోట్ల చలామణి చేస్తున్న నలుగురు సభ్యలు ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.  నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద పక్కా సమాచారంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై శనివారం ఉదయం చివ్వెంల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో ఓ కారులో దొంగనోట్లు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. వాహనంతోపాటు అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(చివ్వెంల)

మరిన్ని వార్తలు