హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్– బరౌని, హైదరా బాద్– కొచువెలి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్– బరౌని (07009/ 07010) ప్రత్యేక రైలు ఈ నెల 24, అక్టోబర్ 1, 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 11.40కి బరౌని చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 27, అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ఉదయం 7.10కి బరౌని నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరా బాద్– కొచువెలి (07115/07116) ప్రత్యేక రైలు అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రెండో రోజు తెల్లవారుజామున 3.20కి కొచువెలికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 8.15కి కొచువెలి నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.30కి హైదరాబాద్ చేరుకుంటుంది.