ఈనెల 10న పొంగులేటి ఒక రోజు రైతుదీక్ష

5 May, 2015 17:46 IST|Sakshi
ఈనెల 10న పొంగులేటి ఒక రోజు రైతుదీక్ష

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈనెల 10వ తేదీన ఒక రోజు నిరాహారదీక్ష కు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పొంగులేటి రైతు దీక్ష చేయనున్నట్లు పార్టీ నేతలు ఎడ్మా కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 నెలల కాలంలో 800 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు.

 

రైతులకు భరోసా కల్పించడంలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయన్నారు. ఈ దీక్ష కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు