కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

19 Nov, 2018 10:47 IST|Sakshi
కండువా వేస్తున్న శ్రీధర్‌బాబు 

మంథని: గుంజపడుగు గ్రామానికి చెందిన సుమారు 200 మంది మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారిలో టీఆర్‌ఎస్, టీడీపీ, సీఎస్సార్‌ యువసేన నాయకులున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన, మండల పరిషత్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ పూదరి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కాని నేడు తెలంగాణ నిరుద్యోగ రాష్ట్రంగా మారిందని ఉస్మానియా యూనివర్సిటీ జేఎసీ చైర్మన్‌ నాగరాజు అన్నారు. మహాకూటమి అభ్యర్థి డి.శ్రీధర్‌బాబుకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ పూర్వ విద్యార్థులు ఆదివారం మంథనిలో ప్రచారం నిర్వహించారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు వినీత్‌ మాట్లాడారు. మహేశ్‌గౌడ్, భట్టు సాయి, రామకృష్ణ, నవీన్, రాము, సందీప్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయుకులు వొడ్నాల శ్రీనివాస్, పోలు శివ, ఎల్లంకి వంశీ, బొబ్బిలి శ్రీధర్, మంథని సురేష్, టి.రాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి...
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ముత్తారం జెడ్పీటీసీ సదానందం, టీపీసీసీ కార్యదర్శి జగన్‌మోహన్‌రావు అన్నారు. ముత్తారం గ్రామంలో ఆదివారం గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. మాజీ సర్పంచులు తాటిపాముల వకూళారాణి, గోవిందుల పద్మ, ఎంపీటీసీ పప్పు స్వరూప, నాయకులు బాలసాని మొగిళిగౌడ్, బుచ్చంరావ్, మద్దెల రాజయ్య, దుండె రాజేందర్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ పనితీరు నచ్చకే కాంగ్రెస్‌లో చేరికలు..
టీఆర్‌ఎస్‌ పార్టీ పని తీరు నచ్చకే ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ముత్తారం జెడ్పీటీసీ చొప్పరి సదానందం, టీపీసీసీ కార్యదర్శి జగన్‌మోహన్‌రావ్‌ అన్నారు. పోతారం గ్రామ టీఆర్‌ఎస్‌కు చెందిన నర్ర రవికుమార్, ముష్కె రాకేశ్, ముష్కె రామకృష్ణ, సాదుల సదయ్య, గడిచెర్ర శంకర్‌తోపాటు సుమారు 30 మంది ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు చెల్కల సుధీర్‌, జితేందర్, ప్రవీణ్, ఓదెలు, యుగేందర్, గాదం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా ప్రచారం
లద్నాపూర్‌లో ఆదివారం గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీగోదారంగనాయక, శ్రీదాసాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు తోట చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి బండారి సదానందం, నాయకులు రొడ్డ బాపు, ముడుసు ఓదెలు, గొర్రె నరేష్, మల్లెంపల్లి శ్రీనివాస్, అడ్డూరి ప్రవీణ్, తొగరి చంద్రయ్య, మేడగోని రాంచందర్, వీరగోని లక్ష్మణ్, గండి ప్రశాంత్, పులి సాయి, గాజు రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు