ఇన్నోవాను ఢీకొన్న లారీ: ఇద్దరికి గాయాలు

1 May, 2016 09:47 IST|Sakshi

కొత్తకోట : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారి 44పై ఆదివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ఉన్న ఇద్దరి వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

>
మరిన్ని వార్తలు