వెటర్నరీ వర్సిటీ వీసీగా మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు

25 Nov, 2014 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పి.వి.నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో వెటర్నరీ యూనివర్సిటీని విభజించారు. యూని వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీసీ నియామకం అవసరమని భావించి ముఖ్యమంత్రి ఈ నియామకం చేపట్టారని ఆ ప్రకటనలో వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు